హైదరాబాద్, వెలుగు: మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్గా రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి, జీసీపీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక కార్యదర్శి వై.రామారావు, కోశాధికారి మీర్ మోసిన్ రజ్వి, హైదరాబాద్ డీవైఎస్ఓ సుధాకర్ రావు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పెటా ప్రెసిడెంట్ టి.విజయసాగర్, లక్ష్మణ్, గోవర్ధన్ రెడ్డి , రాజారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.