
ఇబ్రహీంపట్నం, వెలుగు: తాటి చెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల జంగయ్యగౌడ్(56) రోజువారిలాగే శుక్రవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. మోకు జారడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు.
పెయింటింగ్ వేస్తూ కింద పడి..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్లోని నాదర్గుల్ శివారులో ఓ గోడౌన్ లో ఎండీ హతీబ్(27) గురువారం సాయంత్రం షెడ్పై పెయింటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వనస్థలిపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి స్వస్థలం బీహార్ అని పోలీసులు తెలిపారు.