అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్

జైపూర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ ఏరియాల్లో వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను తెలుపుతూ వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతం లోపలికి వచ్చే పశువుల కాపర్లతోపాటు ప్రజలకు అగ్ని ప్రమాదాల కారణంగా కలిగే నష్టాలను తెలుపుతూ వాటి నియత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నామన్నారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లేవారు బీడీలు, సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయొద్దని సూచించారు.