
Gold Price Today: అమెరికా దూకుడు చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కష్టాలు తప్పవనే సంకేతాలు రోజురోజుకూ గోల్డ్ రేటును పెంచేస్తున్నాయి. ఇప్పటికే తులం రేటు లక్షకు పైన ఉండగా ప్రపంచ రాజకీయ పరిస్థితులతో అది మరింతగా పెరుగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు శ్రావణమాసం షాపింగ్ చేసేందుకు గందరగోళంలో ఉన్నారు. అయితే దేశంలో పెరిగిన ధరలు ఎలా ఉన్నాయో ముందు తెలుసుకుని నిర్ణయం తీసుకోవటం మంచిది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.9వేల 380, ముంబైలో రూ.9వేల 380, దిల్లీలో రూ.9వేల 395, కలకత్తాలో రూ.9వేల 380, బెంగళూరులో రూ.9వేల 380, కేరళలో రూ.9వేల 380, పూణేలో రూ.9వేల 380, వడోదరలో రూ.9వేల 385, జైపూరులో రూ.9వేల 395, లక్నోలో రూ.9వేల 395, మంగళూరులో రూ.9వేల 380, నాశిక్ లో రూ.9వేల 383, మైసూరులో రూ.9వేల 380, అయోధ్యలో రూ.9వేల 395, బళ్లారిలో రూ.9వేల 380, గురుగ్రాములో రూ.9వేల 395, నోయిడాలో రూ.9వేల 395 వద్ద ఉన్నాయి.
ALSO READ : క్రిప్టోల పేరుతో సీనియర్ సిటిజన్ల టార్గెట్.. ఈ టిప్స్ ఫాలో అయితే డబ్బు సేఫ్!
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.11 వందలు పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ పసిడి రేట్లను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 233, ముంబైలో రూ.10వేల 233, దిల్లీలో రూ.10వేల 248, కలకత్తాలో రూ.10వేల 233, బెంగళూరులో రూ.10వేల 233, కేరళలో రూ.10వేల 233, పూణేలో రూ.10వేల 233, వడోదరలో రూ.10వేల 238, జైపూరులో రూ.10వేల 248, లక్నోలో రూ.10వేల 248, మంగళూరులో రూ.10వేల 233, నాశిక్ లో రూ.10వేల 236, మైసూరులో రూ.10వేల 233, అయోధ్యలో రూ.10వేల 248, బళ్లారిలో రూ.10వేల 233, గురుగ్రాములో రూ.10వేల 248, నోయిడాలో రూ.10వేల 248గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.93వేల 800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 2వేల 330గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 26వేల వద్ద ఉంది.