ఇండియా స్టార్ బాక్సర్లు అమిత్, థాపాకు గోల్డ్ మెడల్స్

ఇండియా స్టార్ బాక్సర్లు అమిత్, థాపాకు గోల్డ్ మెడల్స్

న్యూఢిల్లీ :  ఇండియా స్టార్ బాక్సర్లు అమిత్ పంఘల్, శివ థాపా ఎలైట్ మెన్స్‌‌‌‌‌‌‌‌ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన 51 కేజీ ఫైనల్లో అమిత్ (సర్వీసెస్) 5–0తో అన్షుల్ పునియా (చండీగఢ్​)ను చిత్తు చేశాడు. 63.5 కేజీ ఫైనల్లో థాపా (అస్సాం) కూడా 5–0తో విన్షాజ్ (సర్వీసెస్‌‌‌‌‌‌‌‌)ను ఓడించాడు.

+92 కేజీ ఫైనల్లో పంజాబ్ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైపాల్ సింగ్ ​కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్​ మెడలిస్ట్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. కాగా ఈ టోర్నీలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ 10 గోల్డ్ సహా 12 మెడల్స్‌‌‌‌‌‌‌‌తో మరోసారి ఓవరాల్ చాంపియన్​షిప్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకుంది. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆకాశ్​ సాంగ్వాన్ (71 కేజీ) బెస్ట్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.