న్యూఢిల్లీ : ఇండియా స్టార్ బాక్సర్లు అమిత్ పంఘల్, శివ థాపా ఎలైట్ మెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన 51 కేజీ ఫైనల్లో అమిత్ (సర్వీసెస్) 5–0తో అన్షుల్ పునియా (చండీగఢ్)ను చిత్తు చేశాడు. 63.5 కేజీ ఫైనల్లో థాపా (అస్సాం) కూడా 5–0తో విన్షాజ్ (సర్వీసెస్)ను ఓడించాడు.
+92 కేజీ ఫైనల్లో పంజాబ్ బాక్సర్ జైపాల్ సింగ్ కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ సాగర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. కాగా ఈ టోర్నీలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ 10 గోల్డ్ సహా 12 మెడల్స్తో మరోసారి ఓవరాల్ చాంపియన్షిప్ సొంతం చేసుకుంది. ఆ టీమ్కు చెందిన ఆకాశ్ సాంగ్వాన్ (71 కేజీ) బెస్ట్ బాక్సర్గా నిలిచాడు.