
ముంబై : గోల్డ్ ధర రోజు రోజుకి పరుగులు పెడుతుంది. ముంబైలో సోమవారం పదిగ్రాముల బంగారం రూ 40,000 దాటింది. వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే రూ 41,000 దాటుతాయని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఫెడరేషన్ మాజీ చైర్మన్ బచ్ రాజ్ బమాల్వా చెప్పారు.
బంగారం ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని, పాత బంగారం రీసైక్లింగ్ పెరిగిందని ముంబై జ్యూవెలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రాకేష్ శెట్టి చెప్పారు. దీపావళి నాటికి పదిగ్రాముల గోల్డ్ రూ 41,000కు చేరుతుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.