
- బంగారు, వెండి ఆభరణాలు, ఆటో, బైక్ సీజ్
- మీడియా సమావేశంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి
నర్సంపేట, వెలుగు : వరుస చోరీల ముఠాను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద బంగారు, వెండి ఆభరణాలు, నగదును సీజ్ చేశారు. నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్కు చెందిన మహ్మద్ఇమ్రాన్, మాదాసు నవీన్, మాదాసు భార్గవి దంపతులు, కొత్తగూడెం జిల్లా కొండైగూడెంకు చెందిన భార్గవి చెల్లెళ్లు కుంజా విజయ, బత్తుల రాజేశ్వరి ముఠాగా ఏర్పడ్డారు.
కొన్నాళ్లుగా తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేస్తూ బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్తున్నారు. నర్సంపేట, ఖానాపురం, మహబూబాబాద్ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఐదుగురు నిందితుల వద్ద 2.2 తులాల బంగారం, 38 తులాల వెండి, ఐదు సెల్ ఫోన్లు, ఆటో, బైక్స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రెస్ మీట్ లో ఎస్ఐలు రవికుమార్, అరుణ్కుమార్, హెడ్కానిస్టేబుల్మహ్మద్ఖాజం అలీ, నాగరాజు ఉన్నారు.