- టీ20 వరల్డ్ కప్ టీమ్లో చోటు
- స్టాండ్బైగా షమీ, చహర్
- ఆసీస్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లకు ఎంపిక
ముంబై: టీమిండియాకు, క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ టీ20 వరల్డ్ కప్లో బరిలోకి దిగబోతున్నారు. ఆక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగా టోర్నీకి ఈ ఇద్దరూ ఎంపికయ్యారు. ఈ టోర్నీలో పోటీ పడే 15 మందితో కూడిన జట్టును ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. స్వదేశంలో ఆస్ట్రేలియా (ఈనెల 20 నుంచి), సౌతాఫ్రికా (ఈనెల 28 నుంచి)తో జరిగే మూడేసి టీ20ల సిరీస్లకు కూడా జట్లను ఎంపిక చేసింది. బుమ్రా, హర్షల్ లేకుండా ఆసియా కప్లో ఆడిన ఇండియా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పుడు వీళలు తిరిగి రావడంతో పేస్ విభాగం బలోపేతం అయింది. బుమ్రా, హర్షల్ తప్పితే ఆసియా కప్లో ఆడిన ప్లేయర్లనే వరల్డ్ కప్నకు కొనసాగించారు. యంగ్ పేసర్ అవేశ్ ఖాన్, స్పిన్నర్ రవి బిష్ణోయ్పై మాత్రం వేటు పడింది. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్తో బుమ్రా, హర్షల్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. జడేజాకు సర్జరీ కావడంతో ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీని సెలెక్టర్లు తిరిగి షార్ట్ ఫార్మాట్లోకి తీసుకున్నారు. అతనితో పాటు యంగ్ పేసర్ దీపక్ చహర్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 వరల్డ్కప్నకు స్టాండ్బైగాత తీసుకున్నారు. అలాగే, షమీ, దీపక్ చహర్కు ఆసీస్, సౌతాఫ్రికాతో సిరీస్ల్లో చాన్స్ ఇచ్చారు. ఆసీస్తో టీ20లకు అర్ష్దీప్, సౌతాఫ్రికాతో టీ20లకు హార్దిక్, భువనేశ్వర్ విశ్రాంతి తీసుకొని ఎన్సీఏలో రిపోర్టు చేస్తారు.
టీ20 వరల్డ్కప్ టీమ్:
రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, హుడా, పంత్ (కీపర్), కార్తీక్ (కీపర్), పాండ్యా, అశ్విన్, చహల్, అక్షర్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, హర్షల్, అర్ష్దీప్ సింగ్.
స్టాండ్బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్.