రియల్ ఇన్సిడెంట్స్‌‌తో.. గోపీచంద్, రవితేజ  కొత్త సినిమా

రియల్ ఇన్సిడెంట్స్‌‌తో.. గోపీచంద్, రవితేజ  కొత్త సినిమా

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై తెరకెక్కుతోన్న చిత్రం  గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, తొలి షాట్‌‌కు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.  అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్ర్కిప్ట్‌‌ని అల్లు అరవింద్ మేకర్స్‌‌కి అందజేశారు.  నటుడిగా మారిన ఫిల్మ్ మేకర్ సెల్వరాఘవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా.

అలాగే  ఇందూజ రవిచంద్రన్‌‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది.  హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియజేస్తారు.  రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబోలో రూపొందుతోన్న నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.