బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో 70 వేల బోగస్ ఓట్లకు కుట్ర జరుగుతోందని చెప్పారు. ఒక సెగ్మెంట్ ఓట్లు మరో సెగ్మెంట్ లోకి వెళ్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో తెలంగాణలో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు.

మహారాష్ట్ర, కర్ణాటక వ్యక్తుల ఓట్లు తెలంగాణలో నమోదై ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా దొంగనోట్లు పెరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోశామహల్ సెగ్మెంట్ లో ఓట్లు తగ్గుతున్నాయని, మిగతా సెగ్మెంట్లలో ఓట్లు పెరుగుతున్నాయని చెప్పారు.