హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జులై 22న(శనివారం) తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.