పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో సోమవారం రాత్రి వైభవంగా ఉర్సు ఉత్సవాలు జరిగాయి. దర్గా ప్రధాన ముజేవార్ బోలేషావలి ఇంటి వద్ద నుంచి గంధం ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఫకీర్లు చేసిన విన్యాసాలు, ఖవ్వాలి పాటలు ఆకట్టుకున్నాయి. మంగళవారం హజ్రత్ సయ్యద్యాకూబ్బాబాకు గంధం సమర్పించారు. వేడుకలకు హాజరైన మతపెద్దలు, భక్తులు, యాత్రికులు మొక్కులు సమర్పించుకున్నారు. దీపారాధన, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఎంపీవో శేషు ఆధ్వర్యంలో దర్గా సమీపంలో పారిశుధ్య పనులు చేపట్టారు.
కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వక్ఫ్బోర్డు అసిస్టెంట్సెక్రటరీ అమీర్ అహ్మద్, ఉర్సు ఇన్చార్జి ఫయాజ్ అహ్మద్, ఇన్స్పెక్టర్ రియాజ్, ముజేవార్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మామునూర్ ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సైలు ప్రవీణ్, వంశకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
