జీడిమెట్ల/శంకర్ పల్లి, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్తగిలింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్రెడ్డి బీఆర్ఎస్ను వీడి, అధికార కాంగ్రెస్పార్టీలో చేరారు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో 9 మంది కార్పొరేటర్లు, ఓ కోఆప్షన్ మెంబర్ తో కలిసి ఆమె కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి సీఎం రేవంత్వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మేయర్నీల మాట్లాడుతూ.. నిజాంపేట కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్మైనంపల్లి హనుమంతరావు, కొలను హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
శంకర్పల్లి మున్సిపల్చైర్ పర్సన్, జడ్పీటీసీ కూడా..
శంకర్పల్లి మున్సిపల్చైర్ పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ గోవిందమ్మ, పలువురు కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్పార్టీలో చేరారు. గురువారం సిటీలోని ఇంట్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలన పోయి, ప్రజాపాలన వచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశాంతంగా తమ పనులు చేసుకోవాలని చెప్పారు. అందుకు పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జ్భీం భరత్, టీపీసీసీ కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల, మున్సిపల్అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వై.ప్రకాష్కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.