వల్సాడ్(గుజరాత్): ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ కోసం నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు కారిడార్లో గుజరాత్ రాష్ట్రం వల్సాడ్ వద్ద 350 మీటర్ల పొడవైన టన్నెల్తవ్వకం విజయవంతంగా పూర్తయింది. జరోలి గ్రామ సమీపంలో పర్వతాన్ని తొలిచి ఈ సొరంగం తవ్వకాన్ని పూర్తి చేశారు. మొత్తం 508 కి.మీ. బుల్లెట్ రైల్ కారిడార్ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ వల్సాడ్ సెక్షన్ చీఫ్ మేనేజర్ ఎస్పీ మిట్టల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కి.మీ స్పీడ్తో వెళ్తుంది, కనుక టన్నెల్ పూర్తిగా స్ట్రైట్(సరళరేఖలో)గా ఉండాలి. అలా నిర్మించడం చాలా పెద్ద చాలెంజ్. ప్రతి చిన్న అంశాన్ని కూడా కచ్చితంగా పాటించాలి. మేం దీన్నో సవాలుగా తీసుకొని పనిచేశాం.. ఒక్క మిల్లీమీటర్ కూడా తేడా రాలేదు.
టన్నెల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చివరి దశపనులు స్టార్ట్ చేస్తం’’ అని అన్నారు. తన సెక్షన్ పరిధిలో నిర్మించిన మొదటి టన్నెల్ ఇదేనని.. టన్నెల్ విజయవంతంగా పూర్తి చేయడం సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.