అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో తెలంగాణ  విద్యార్థిపై కాల్పులు

అమెరికా చికాగోలో ఉన్నత విద్యను చదువుతున్న  సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి కొప్పాల సాయిచరణ్ పై దుండగులు  కాల్పులు జరిపారు.  దీంతో సాయి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం అతనికి చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు.  సాయి తల్లిదండ్రులు బీహెచ్ఈఎల్ ఎల్ఐజి కాలనీలో  నివసిస్తున్నారు.  కాల్పులు జరిగిన విషయాన్ని సాయి తల్లిదండ్రులకు అతని స్నేహితలు సమాచారం అందించారు. ఉన్నత విద్య కోసం సాయి చరణ్ ఈ నెల11వ తేదీన చికాగోకు వెళ్లాడు. అక్కడ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతనిపై  దుండగులు  కాల్పులు జరిపారు.