పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
  • తాను బాబాయ్ ప్రమోషన్ పొందిన శుభదినం అంటూ హీరో విశాల్ ట్వీట్

తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా సైగల్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్వీట్ ద్వారా ఆనందాన్ని పంచుకున్నాడు. శుక్రవారం రాత్రి నా సోదరుడు ఆర్య తండ్రి అయ్యాడనే శుభవార్త చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది.. పండంటి ఆడబిడ్డకు సాయేషా సైగల్ జన్మనిచ్చిందని తెలిపాడు. షూటింగ్ లో ఉండగా ఈ విషయం తెలియడంతో సంతోషంతో పొంగిపోతున్నాను.. పాపకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ హీరో విశాల్ ట్వీట్టర్ లో కామెంట్ చేశారు. 
సాయేషా సైగల్ తెలుగునాట అక్కినేని ‘‘అఖిల్’’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత సుమీత్ సెహగల్, షహీన్ బానో దంపతుల కుమార్తె. అంతేకాదు అలనాటి బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ మనవరాలు కూడా. టాలీవుడ్ సినమాతో ఎంట్రీ ఇచ్చిన సాయేషా సెహగల్ అటు తర్వాత బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. తమిళ సినిమాల్లో నటిస్తున్న సమయంలో తెలుగు తెరకు పరిచయమైన హీరో ఆర్యతో ప్రేమలో పడింది. 
వీరి ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పడంతో 2019 మార్చి 10న కరోనా లాక్ డౌన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు హైదరాబాద్ నగరంలోని తాజ్ ప్యాలెస్ లో ఘనంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లాక్ డౌన్ రావడంతో కుటుంబానికే పరిమితం అయ్యారు. అయితే హీరో ఆర్య పలు సినిమాల్లో నటిస్తూనే భార్య సాయేషాకు ఎక్కువ సమయం కేటాయిస్తూ వచ్చాడు. తొలి దశ లాక్ డౌన్ తర్వాత తమిళంలో రిలీజ్ అయిన ‘‘సర్పట్ట పరంపరే’’ సినిమాతో హిట్ కొట్టాడు. ఆర్య-సాయేషా దంపతులకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని రహస్యంగా ఉంచినా.. హీరో విశాల్ బహిరంగం చేయడంతో ఇరువురి అభిమానులు, నెటిజనులు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.