ఓట్ల కోసమే మైనారిటీలకు గాలం:ఎంపీ అర్వింద్

ఓట్ల కోసమే మైనారిటీలకు గాలం:ఎంపీ అర్వింద్
  • సీఎం కేసీఆర్​పై ఎంపీ అర్వింద్​ఫైర్​

నిజామాబాద్,  వెలుగు:  ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికి సీఎం కేసీఆర్​ మైనారిటీలకు గాలం వేస్తున్నారని  ఎంపీ అర్వింద్ ఆరోపించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సీఎం కేసీఆర్​ అదే వెనుకబాటుతనంలో ఉన్న మైనారిటీలకు కేవలం రూ.లక్ష మాత్రమే ఇవ్వడాన్ని గమనించాలని సూచించారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడానికి తాను ఈ సంగతి ప్రస్తావిస్తున్నట్టు చెప్పారు. 
మంగళవారం రాత్రి నగరంలోని మార్వడీ మంచ్​లో ఆయన మాట్లాడారు.. అవినీతి, అహంభావంతో కవిత ఓటమి చెందారన్నారు.  వచ్చే ఎలక్షన్లలో తాను ఎక్కడ పోటీ చేసినా బీఆర్ఎస్​ పెద్దలే తన వెనుకరావాలని, గెలిచి తన సత్తా ఏమిటో చూపుతానన్నారు. ఎలక్షన్​లో పోటీ చేసే కాంగ్రెస్​ క్యాండిడెట్ల బీ ఫారాలు మార్కెట్​లో దొరుకుతాయని ఆయన ఎద్దేవా చేశారు.  కష్టపడేవారికి మాత్రమే బీజేపీలో టికెట్లు ఇస్తారన్నారు. 
కొన్ని కాంగ్రెస్​ మీడియా చానళ్లు బీజేపీ గ్రాఫ్​ పడిపోయిందని ప్రచారం చేస్తూ ఒకరిద్దరూ బీజేపీ లీడర్లను మాత్రం ఎత్తుతూ రాజకీయం చేస్తున్నాయన్నారు.  కార్యక్రమంలో ధన్​పాల్​ సూర్య నారాయణ గుప్తా, స్రవంతిరెడ్డి, పోతన్కర్​ లక్ష్మీనారాయణ, లింగం, రోషన్​లాల్​, శ్యాంసుందర్​ అగర్వాల్​, సీతారామ్​పాండే, నారాయణ అటల్​, తివారీ తదితరులు పాల్గొన్నారు.