సిడ్నీ: పాకిస్తాన్పై సంచలన విజయంతో జోరుమీదున్న టీమిండియా.. టీ20 వరల్డ్కప్లో రెండో మ్యాచ్కు రెడీ అవుతోంది. గురువారం నెదర్లాండ్స్తో జరిగే పోరు కోసం రోహిత్సేన సోమవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. రెండు గంటల పాటు జరిగిన నెట్ సెషన్లో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్, కోహ్లీ చెమటోడ్చారు. నాణ్యమైన పేస్ అటాక్ను ఎదుర్కొంటూ రాహుల్ తన ఫుట్వర్క్ లోపాన్ని సరి చేసుకున్నాడు.
అయితే ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్రేక్ తీసుకోగా.. పేసర్లు అర్ష్దీప్, భువనేశ్వర్, షమీ నెట్స్కు రాలేదు. పాక్తో మ్యాచ్లో చివర్లో కొద్దిగా ఇబ్బందిపడిన పాండ్యాకు.. తదుపరి మ్యాచ్లో రెస్ట్ ఇచ్చే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అతని ప్లేస్లో దీపక్ హుడాకు చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే టీమ్ బ్యాలెన్స్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
న్యూసౌత్ వేల్స్కు ఆడుతున్న పాక్ యంగ్ ప్లేయర్ ఇర్ఫాన్ జూనియర్.. ఇండియన్ క్రికెటర్లకు నెట్స్లో బౌలింగ్ చేశాడు. పాక్ మాజీ బౌలర్ సోహైల్ తన్వీర్ మాదిరి బౌలింగ్ యాక్షన్తో ఇర్ఫాన్ ఆకట్టుకున్నాడు. బౌన్సర్లు, స్వింగ్తో కోహ్లీ, కార్తీక్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఇర్ఫాన్ బౌలింగ్ను రోహిత్ ప్రశంసించాడు.