'యు మై స్టార్' .. పాండ్యాని పొగిడిన నటాషా

'యు మై స్టార్' ..  పాండ్యాని పొగిడిన నటాషా

దుబాయ్‌లో నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీంఇండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇరు జట్లు భారీ స్కోర్ చేయనప్పటికీ మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ లో టీంఇండియాకు 6 బంతుల్లో 7 పరుగలు అవసరమున్న టైమ్ లో క్రీజ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా ఎలాంటి  టెన్షన్ పడకుండా... భారీ సిక్సర్ తో జట్టకు విజయాన్ని అందించాడు.  

మ్యాచ్ లో కీరోల్  ప్లే చేసిన పాండ్యాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.  మ్యాచ్ విన్నర్ గా నిలిచిన  పాండ్యాను  అభిమానులు హీరో అంటూ అభినందిస్తున్నారు. అందులో భాగంగానే   హార్దిక్ పాండ్యా సతీమణీ  నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి  గర్వంగా ఉంది... యు మై స్టార్ అంటూ రెడ్ హార్ట్ , స్టార్ ఎమోజీలని జోడించింది.  పూర్తి స్థాయిలో జట్టులోకి వచ్చినప్పటి నుండి హార్దిక్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.