హెచ్సీఎల్తో పియర్సన్ జోడీ

హెచ్సీఎల్తో  పియర్సన్ జోడీ

హైదరాబాద్​, వెలుగు: హెచ్​సీఎల్ ​టెక్,​  పియర్సన్ సంస్థలు ఏఐ స్కిల్స్​ను పెంపొందించడానికి,   నైపుణ్యాల కొరతను తీర్చడానికి ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.  దీనిద్వారా, ఇరు సంస్థలు ఏఐ -ఆధారిత లెర్నింగ్​ సొల్యూషన్లను రూపొందించడానికి, కెరీర్ ఎదుగుదలకు తోడ్పడటానికి,  సంస్థలు వేగంగా మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తాయి. పియర్సన్ తన ప్రపంచ స్థాయి లెర్నింగ్​ టెక్నాలజీలను హెచ్​సీఎల్​టెక్ డిజిటల్, ఏఐ  ఇంజనీరింగ్ సామర్థ్యాలతో కలిపి, ఏఐ- శక్తితో కూడిన కొత్త ప్రొడక్టులను అభివృద్ధి చేయనుంది. ఇవి గ్లోబల్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి.