జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

మహదేవపూర్, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ మండల పరిధిలోని బేగ్లూర్​లో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని గురువారం రెండో రోజు కొనసాగించారు. ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ పీవోడీ రమేశ్​ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కాళేశ్వరం పీహెచ్​సీ మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ టి.సుష్మిత, బొమ్మపూర్​ డాక్టర్​ వినయ్​తో కలిసి ఎన్ఎస్ఎస్​ వలంటీర్లు గ్రామస్తులకు రక్తపరీక్షలు నిర్వహించారు. 

బీపీ, షుగర్, ఫీవర్, ఇతర వ్యాధులకు మందులను పంపిణీ చేశారు. డాక్టర్​ సుష్మిత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఎనీమియా ఉన్నట్లు గుర్తించామని, సీజనల్​ వ్యాధులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, బేగ్లూర్​ఎక్స్ సర్పంచ్ రాజయ్య, కళాశాల ఫిజిక్స్ అధ్యాపకుడు కరుణ ప్రకాష్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.