మహబూబ్​నగర్​ జిల్లాలో దంచికొట్టిన వాన.. చల్లబడ్డ వాతావరణం

 మహబూబ్​నగర్​ జిల్లాలో దంచికొట్టిన వాన.. చల్లబడ్డ వాతావరణం

-వెలుగు స్టాఫ్​ ఫొటోగ్రాఫర్​, మహబూబ్​నగర్​ : మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో వర్షం దంచి కొట్టింది. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.  మైత్రి నగర్​ వద్ద నాలాలు పొంగడంతో  నీరు రోడ్డుపై కి వచ్చాయి. బీకేరెడ్డి కాలనీలో పెద్ద చెరువు నాలా నుంచి బయటకు రావడంతో.. దిగువ ప్రాంతానికి చేరాయి. దీంతో స్థానికులు కొంత ఇబ్బందులు పడ్డారు.

అలాగే క్లాక్​ టవర్​ ప్రాంతంలో వర్షానికి రోడ్లు జలయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది.  మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  స్థానిక నాయకులతో కలిసి వర్షం కురిసిన ప్రాంతాలను పరిశీలించారు.  ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.  పాలమూరులో డ్రైనేజీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.