తిరుపతిలో బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం

తిరుపతిలో బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం

తిరుపతి: తిరుపతిలో సీక్రెట్ గా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీనగర్ కాలనీలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార దందాపై పోలీసులకు తెలిసింది. వాట్సాప్ ద్వారావిటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. మంగళవారం ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేశారు. నలుగురు విటులు, నిర్వాహకులను అరెస్టు చేశామని.. విచారణలో నిజాలు బయటకు వచ్చాయన్నారు. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఇద్దరు మహిళలని..ఈ దందా నిర్వహిస్తోంది కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 

యువతుల ఫొటోలను సాయిచరణ్, అనిరుధ్ కుమార్ లు విటులకు పంపుతూ దందా చేస్తున్నారని.. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి.. జీవకోన శ్రీనగర్ కాలనీకి చెందిన సాయిచరణ్, అనిరుధ్ ద్వారా లక్ష్మిప్రియ, స్వప్నలు వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని సీఐ తెలిపారు. వీరి నుంచి కొంతమంది యువతులను రక్షించినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో సంబంధమున్న నలుగురిపై కేసు నమోదు చేశామన్న సీఐ.. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ చేపట్టినట్లు తెలిపారు.