కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి :  జస్టిస్ సుజయ్ పాల్

 కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి :  జస్టిస్ సుజయ్ పాల్
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్

హాలియా, వెలుగు : కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అధికారులకు సూచించారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, జడ్జి క్వార్టర్స్​ను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువయ్యేందుకు కోర్టు భవనాలు తప్పనిసరన్నారు.

నిడమనూరు జూనియర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటులో లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. హైకోర్టు జడ్జి వినోద్ కుమార్ మాట్లాడుతూ పేదలందరికీ న్యాయ సేవలు అందించాలని సూచించారు. కోర్టులో కేసులు సత్వరమే పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. జిల్లా న్యాయమూర్తి ఎం.నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో మరెక్కడా లేని సౌకర్యవంతంగా కోర్టు భవన నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నామని, వాటిని నిర్వహణ కూడా సక్రమంగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.