మోతీలాల్‌‌‌‌కు సెబీ రూ.3 లక్షల ఫైన్‌‌‌‌.. ఆ తప్పే కారణం..?

మోతీలాల్‌‌‌‌కు సెబీ రూ.3 లక్షల ఫైన్‌‌‌‌.. ఆ తప్పే కారణం..?
  • స్టాక్ బ్రోకర్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకే

న్యూఢిల్లీ:    స్టాక్ బ్రోకర్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌‌‌‌కు  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ.3 లక్షల  ఫైన్ వేసింది.  45 రోజుల్లోగా ఈ ఫైన్ చెల్లించాలని  ఆదేశించింది. ఏప్రిల్ 2022 నుంచి జనవరి 2024 వరకు  మోతీలాల్ ఓస్వాల్‌‌‌‌పై దర్యాప్తు  నిర్వహించింది. ట్రేడింగ్ టెర్మినల్స్ ఆథరైజ్డ్ (అనుమతి పొందిన) ప్లేస్‌‌‌‌లలో లేవని గుర్తించింది. 

ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ కోసం  13 టెర్మినల్స్ ఉండాల్సిన  లొకేషన్‌‌‌‌లో లేవు.  అందులో 5 టెర్మినల్స్ నుంచి ట్రేడ్స్ జరిగాయి.  4 టెర్మినల్స్‌‌‌‌ను అనుమతులు పొందిన వారు కాకుండా వేరే వాళ్లు ఆపరేట్ చేశారు. బీఎస్‌‌‌‌ఈ కోసం 9 టెర్మినల్స్ రిపోర్టెడ్ లొకేషన్‌‌‌‌లో లేవు.  ఒక టెర్మినల్ నుంచి ట్రేడ్స్ జరిగాయి.  4 టెర్మినల్స్‌‌‌‌ను ఆప్రూవ్డ్ యూజర్స్ కాకుండా ఇతరులు ఉపయోగించారు.  స్టాక్ బ్రోకర్ రూల్స్ ప్రకారం, ట్రేడింగ్ టెర్మినల్స్‌‌‌‌ను అన్‌‌‌‌ఆథరైజ్డ్ పర్సన్స్ లేదా ప్లేస్‌‌‌‌లలో ఉపయోగించడం వల్ల ఫైనాన్షియల్ పెనాల్టీ విధిస్తారు.