దర్శకుడు వీఎన్‌‌ ఆదిత్యకు గౌరవ డాక్టరేట్

దర్శకుడు వీఎన్‌‌ ఆదిత్యకు గౌరవ డాక్టరేట్

దర్శకుడు వి.ఎన్.ఆదిత్యను అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ గౌరవ డాక్టరేట్‌‌తో సత్కరించింది. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌తో మెప్పించిన ఆయన..  గత పాతికేళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఇటీవల బెంగళూర్‌‌‌‌లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్‌‌లో వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్‌‌లను ప్రదానం చేసింది. అందులో సినిమా రంగం నుండి వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దీన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నా. నేను ఎంతగానో ఇష్టపడిన సినీ రంగంలో డాక్టరేట్ పొందడం.. నాతో పాటు మా అమ్మకు సంతోషాన్ని ఇచ్చే విషయం’ అన్నారు. నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ ఎస్‌‌సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు.