కూరగాయల సాగులో మెలకువలు పాటించాలి : వెంకటేశం

కూరగాయల సాగులో  మెలకువలు పాటించాలి :  వెంకటేశం
  • జిల్లా హార్టికల్చర్​ ఆఫీసర్​ వెంకటేశం

అచ్చంపేట, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో కూరగాయలు, పండ్ల తోటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను కాపాడుకోవాలని జిల్లా హార్టికల్చర్​ ఆఫీసర్​ వెంకటేశం సూచించారు. మంగళవారం అచ్చంపేట డివిజన్​లోని వివిధ గ్రామాల్లో మిరప, కూరగాయలు, పూల తోటలను ఆయన పరిశీలించారు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో నష్టాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. డివిజన్  హార్టికల్చర్​ ఆఫీసర్​ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.