వేసవి వేడిని తరిమి కొట్టాలంటే ఒంటిని చల్లబర్చే ఫుడ్ తినాలి. వాటిల్లో పెరుగుది ఫస్ట్ ప్లేస్. అందులోనూ పెరుగు, అరటిపండు కలిపి స్మూతీ చేసుకుంటే..సూపర్ కాంబినేషన్ అవుతుంది.
మరింకెందుకు ఆలస్యం.
పెరుగు – బనానా స్మూతీ
కావాల్సినవి
పెరుగు – ఒక కప్పు, అరటి పండు – ఒకటి
చక్కెర – మూడు టీ స్పూన్లు
కుంకుమ పువ్వు – చిటికెడు,
యాలకుల పొడి – చిటికెడు , జీడిపప్పు పలుకులు – కొన్ని
ఇలా చేయాలి
అరటిపండుని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. అందులో చక్కెర, పెరుగు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసి కొద్దిసేపు ఫ్రిజ్లో ఉంచాలి. తర్వాత కుంకుమ పువ్వు, జీడిపప్పు పలుకులు కూడా వేస్తే కూల్కూల్ పెరుగు స్మూతీ రెడీ.