
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు హైదరాబాద్ అభిమానుల నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల్లో ఇండియా మ్యాచ్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్కు కేవలం 8,991 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో మెజారిటీ ఫ్యాన్స్ పాకిస్థాన్కు సపోర్ట్ ఇచ్చారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కనిపించినప్పుడల్లా గట్టిగా అరుస్తూ సందడి చేశారు.