
చంపిన వారి ఆచూకీ చెబితే రూ. 2 లక్షల రివార్డ్
హైదరాబాద్/ తిరువనంతపురం: సంచలం కలిగించిన కేరళ ఏనుగు మృతికి సంబంధించిన నిందితుల సమాచారం చెప్పిన వారికి రూ. 2 లక్షల నజరానాను ప్రకటించారు హైదరాబాద్కు చెందిన బి.టి. శ్రీనివాసన్. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్కు మెయిల్ పంపించానని ఆయన చెప్పారు. ఏనుగు చావుకు కారణమైన వ్యక్తిని గుర్తించిన వారిని తాను కేరళవెళ్లి కలుసుకుంటానని కూడా ఆయన అన్నారు. శ్రీనివాసన్ గ్రేటర్హైదరాబాద్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
మరోవైపు, గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకుడైన ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ ఫారెస్ట్ మినిస్టర్ శుక్రవారం మీడియాకు చెప్పారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడేందుకు పెట్టిన బెల్లం పూసిన నాటుబాంబును తిని ఏనుగు చనిపోయి ఉండవచ్చునని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అరెస్టయిన వ్యక్తి ఇతరుల కోసం నాటు బాంబును స్వయంగా తయారు చేసి ఇచ్చాడని పాలక్కడ్ జిల్లా పోలీసు చీఫ్ తెలిపారు. ఈ కేసులో మరింతమంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.