తెలంగాణకు మరో రెండు మెడల్స్‌‌‌‌

తెలంగాణకు మరో రెండు మెడల్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గోవా నేషనల్ గేమ్స్‌‌‌‌లో తెలంగాణకు మరో  రెండు మెడల్స్‌‌‌‌ లభించాయి. హైదరాబాద్‌‌‌‌ స్విమ్మర్ వ్రితి అగర్వాల్‌‌‌‌ బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 200 మీటర్ల బటర్‌‌‌‌‌‌‌‌ఫ్లైలో బ్రాంజ్ నెగ్గింది. ఫైనల్లో వ్రితి 2 నిమిషాల 22.28 సెకండ్ల  టైమింగ్‌‌‌‌తో మూడో ప్లేస్ సాధించింది. ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో వ్రితి ఇప్పటికే రెండు మెడల్స్‌‌‌‌ గెలిచింది. మరోవైపు టెన్నిస్‌‌‌‌లో తెలంగాణ విమెన్స్‌‌‌‌ టీమ్ బ్రాంజ్ మెడల్‌‌‌‌ సొంతం చేసుకుంది. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని సెమీస్‌‌‌‌ చేరుకున్నారు.