
ఓటమిని నేనొప్పుకోను..
వాషింగ్టన్: ‘‘అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నేనే గెల్చిన. ఓటమిని ఒప్పుకునే మూడ్ లో లేను. ఎన్నికల రిజల్ట్ పై న్యాయపోరాటం కొనసాగిస్త..” అని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవహారంపై ఆయన ఆది, సోమవారాల్లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం వల్లే ఆయన (జో బైడెన్) గెలిచిండు. కౌంటింగ్ కు మా ఎన్నికల పరిశీలకులను అనుమతించలే..” అంటూ ట్రంప్ ఆదివారం ట్వీట్ చేయడంతో ఆయన.. బైడెన్ గెలుపును ఒప్పుకున్నట్లేనని, అధికార మార్పిడి ప్రక్రియ ఇక షురువైతుందని విశ్లేషకులు భావించారు. కానీ.. సోమవారం పొద్దునకల్లా ట్రంప్ మాట మార్చారు. తాను ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. ‘‘ఆయన ఈ ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో మాత్రమే గెలిచారు. నేను ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు. మనం మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇది రిగ్గింగ్ చేసిన ఎలక్షన్” అని ఆరోపించారు.
పరిశీలకులను అనుమతించలే..
‘‘నేను ఎలక్షన్ లో గెలిచాను. జో బైడెన్ ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కుతారని ఫేక్ న్యూస్ మీడియా ఎందుకు కంటిన్యూగా చెప్తోంది? ఈ మీడియా మా వైపును మాత్రం చూపించడంలేదు. 2020 ఎలక్షన్ లో రాజ్యాంగంపై దాడి, ఉల్లంఘన జరిగింది. ఇలా గతంలో ఎన్నడూ జరగలే. చాలా రాష్ట్రాల్లో మా ఎన్నికల పరిశీలకులను కౌంటింగ్ రూంలలోకి రానియ్యలే. ఓటింగ్ పూర్తయిన తర్వాత.. లక్షలాది బ్యాలట్లను డెమొక్రాట్లకు అనుకూలంగా మార్చారు. రాడికల్ లెఫ్ట్ కు చెందిన డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ సేఫ్కాదు. ఈ సిస్టమ్ తోనే రిగ్గింగ్ చేశారు. ఈ ఓటింగ్ సిస్టంను టెక్సాస్ లో తిరస్కరించారు. అక్కడ నేను భారీ ఓట్లతో గెలిచా. రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్లు ఫేక్ రిజల్ట్స్ ను అనుమతించబోరు. ప్రపంచం ఇదంతా గమనిస్తోంది” అని ట్రంప్ సోమవారం ట్వీట్లు చేశారు. అయితే ‘‘ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందనడం వివాదాస్పదం” అని పేర్కొంటూ ట్రంప్ ట్వీట్లకు ట్విట్టర్ ఒక వాక్యాన్ని ట్యాగ్ చేసింది. కాగా, ఎన్నికల్లో డెమొక్రటిక్ లీడర్ బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ 270 కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. ట్రంప్ 232 ఓట్లను పొందారు. పెన్సిల్వేనియా, నెవడా, మిషిగాన్, జార్జియా, అరిజోనా, విస్కాన్సిన్ లో ఎన్నికల రిజల్ట్స్ ను ట్రంప్ చాలెంజ్ చేయగా.. 16 ఓట్లున్న జార్జియా స్టేట్ లో మాత్రమే రీకౌంటింగ్ జరుగుతోంది. జార్జియా తప్ప అన్ని స్టేట్స్ లోనూ రిజల్ట్స్ ఇప్పటికే డిక్లేర్ అయ్యాయి.
ఓటమి ఒప్పుకోవాల్సిన టైమ్ వచ్చింది: ఒబామా
అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇక రిజల్ట్ మారిపోయే పరిస్థితి లేదని, అందుకే ట్రంప్ ఓటమిని ఒప్పుకోవాల్సిన టైం వచ్చేసిందని మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అన్నారు. ఆదివారం సీబీఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బైడెన్ కు ఇప్పటికే కావాల్సిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఆయన గెలిచిన ఏ రాష్ట్రంలోనూ రిజల్ట్ ట్రంప్ కు అనుకూలంగా మారే చాన్స్ లేదన్నారు. ‘‘కొత్త ప్రభుత్వానికి ఫండ్స్, ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచేందుకు ట్రంప్ వైట్ హౌస్ వర్గాలు నిరాకరిస్తున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గా గెలిచినప్పుడు సీక్రెట్ సెక్యూరిటీ బ్రీఫింగ్స్ పొందారు. ఇప్పుడు బైడెన్ కు మాత్రం నిరాకరిస్తున్నారు” అని ఒబామా విమర్శించారు. ట్రంప్ తీరు వల్ల అమెరికాలో పొలిటీషియన్లే కాకుండా ఓటర్లు కూడా రెండుగా డివైడ్ అయిపోయారన్నారు. దేశం డివైడెడ్ స్టేట్స్ ఆఫ్అమెరికాగా మారిందన్నారు. సొంత ప్రయోజనాలు, ఇగో కన్నా దేశమే ఫస్ట్ అన్న విషయాన్ని ట్రంప్ గుర్తించాలని కోరారు.
Read more news…