మహీంద్రాలో ఐఎఫ్​సీ పెట్టుబడి.. ఈవీ మొబిలిటీ బిజినెస్​ కోసం రూ. 600 కోట్లు

మహీంద్రాలో ఐఎఫ్​సీ పెట్టుబడి.. ఈవీ మొబిలిటీ బిజినెస్​ కోసం రూ. 600 కోట్లు

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్​ మహీంద్రాలో వరల్డ్​బ్యాంక్​ గ్రూప్​ కంపెనీ ఐఎఫ్​సీ రూ. 600 కోట్లు పెట్టుబడి పెడుతోంది. లాస్ట్​మైల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్​ కోసం ఈ డబ్బు వెచ్చించనున్నట్లు మహీంద్రా అండ్​ మహీంద్రా లిమిటెడ్​ తెలిపింది. లాస్ట్​మైల్​ మొబిలిటీ (ఎల్​ఎంఎం) పేరుతో పెట్టిన సబ్సిడరీ కంపెనీలో ఐఎఫ్​సీ ఇన్వెస్ట్​ చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని ఈవీ మాన్యుఫాక్చరింగ్​ రంగంలో ఐఎఫ్​సీకి ఇదే తొలి పెట్టుబడి కావడం విశేషం. కొత్త కంపెనీలో ఐఎఫ్​సీకి 9.97 శాతం నుంచి 13.64 శాతం దాకా వాటా ఉండొచ్చు. తమ త్రీ వీలర్స్​ ఆల్ఫా, ట్రియో, ఫోర్​ వీలర్​..ఎస్​సీవీ (జీతో) వెహికల్స్​ కొత్త కంపెనీ కింద ఉంటాయని మహీంద్రా అండ్​ మహీంద్రా వెల్లడించింది. ఎలక్ట్రిక్​ మొబిలిటీ లాస్ట్​మైల్​ కనెక్టివిటీని స్కేల్​అప్​ చేయడానికి ఐఎఫ్​సీ ఫండ్స్​ సాయపడతాయని పేర్కొంది. మరిన్ని కొత్త ప్రొడక్టులు తేవడానికీ వీలు కల్పిస్తాయని వివరించింది. క్లయిమేట్​ గోల్స్​ సాధించాలంటే ట్రాన్స్​పోర్ట్​ సెక్టార్లో డీకార్బనైజింగ్​ కీలకమని, ఈ దిశలోనే ఐఎఫ్​సీ తమ కంపెనీకి ఫండింగ్​ ఇస్తోందని మహీంద్రా అండ్​ మహీంద్రా ఎండీ అనీష్​ షా చెప్పారు. ఇండియాలో కరెంటు బండ్లు పెరగాలనే టార్గెట్​తోనే తాము పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా ఐఎఫ్​సీ పేర్కొంది.