ఇజ్రాయెల్లో యూదుల పండుగలో తొక్కిసలాట జరిగి 45 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి లగ్ బావోమర్ ఫెస్టివల్ను జరుపుకునేందుకు పవిత్ర స్థలమైన మౌంట్ మెరన్ దగ్గర యూదులు పెద్దఎత్తున చేరుకున్నారు. పండుగకు పదివేల మందికి మాత్రమే అనుమతివ్వగా లక్ష మందికి పైగా హాజరయ్యారని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా కరోనా కేసులు తగ్గడంతో యువత, పిల్లలు కూడా భారీగా తరలి వచ్చారు. గురువారం రాత్రి మౌంట్ మెరన్ పై రబ్బిషైమన్ బార్ యోచై సమాధి దగ్గర దాదాపు లక్ష మంది పోగయ్యారు. అందరూ డాన్సులు చేస్తూ వేడుక జరుపుకుంటున్నారు. ఇంతలో కొంత మంది పైఅంతస్తు మెట్ల నుంచి జారి కిందపడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. భయభ్రాంతులకు గురై అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కొందరు అక్కడికక్కడే చనిపోయారు. డెడ్ బాడీల మధ్య చిక్కుకుని ఊపిరాడక మరికొందరు సాయం కోసం కేకలు వేశారు. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాయి. తొక్కిసలాట ప్రాంతం బూట్లు, హ్యాట్ లు, వాటర్ బాటిళ్లు చిందరవందరగా పడి ఉన్నాయి. కొన్ని చోట్ల మెటల్ రెయిలింగ్ లు కూడా విరిగి పడ్డాయి. ఘటనపై మాగెన్ డెవిడ్ ఆడమ్ (ఎండీఏ) రెస్క్యూ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎలి బిన్ మాట్లాడుతూ.. 'తొక్కిసలాటలో చిక్కుకున్నవారిని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో రక్షించాం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది' అని అన్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత ఇజ్రాయెల్ హెల్త్ మినిస్ట్రీ మౌంట్ మెరన్ కు వెళ్లొద్దని ప్రజలను కోరింది.
పండుగ సంబరాల్లో తొక్కిసలాట...45 మంది మృతి
- విదేశం
- May 1, 2021
లేటెస్ట్
- Shalini Kondepudi Speech: మై డియర్ దొంగ సక్సెస్ మీట్లో..హీరోయిన్ కమ్ రైటర్ శాలిని హానెస్ట్ స్పీచ్
- NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించే న్యూస్.. ప్రశాంత్ మూవీపై సూపర్ అప్డేట్
- టపాకాయలా ఏంటీ : గేమ్స్ ఆడుతుంటే.. మొబైల్ పేలిపోయింది
- V6 DIGITAL 02.05.2024 AFTERNOON EDITON
- ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే..
- కేసులకు సీఎం రేవంత్ రెడ్డి భయపడరు : చామల కిరణ్ కుమార్ రెడ్డి
- ఆన్లైన్ గేమింగ్ ఎంతపని చేసింది: రూ35 లక్షల గోల్డ్ చోరీచేసిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ షాకింగ్ డెసిషన్..223 మంది మహిళా కమిషన్ ఉద్యోగుల తొలగింపు
- పొద్దున తిట్టుకోవడం, రాత్రి బుజ్జగించుకోవడం.. బీఆర్ఎస్, బీజేపీలకి అలవాటే : మంత్రి పొంగులేటి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!