అమెరికాలాంటి చాలామటుకు అడ్వాన్స్డ్ దేశాల్లో కరోనా వైరస్గా విలయం సృష్టిస్తే, మనదేశం మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటోంది. మెడిసిన్, టెక్నాలజీ.. ఏ ఫీల్డ్లో చూసుకున్నా అవే ముందుంటాయి. కానీ, కరోనాపై పోరులో మాత్రం మనదే పైచేయి. ఇందుకు ఆసక్తి కరమైన కారణాల్ని ఎనలైజ్ చేసి చెబుతున్నారు చైనా మెడికల్ ఎక్స్పర్ట్ ఝాంగ్ వెన్హాంగ్.
కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కొన్ని మైనస్లు ఉన్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. అందుకు రీజన్ ‘భారతీయుల మనోబలమే’ అని ఝూంగ్ చెబుతున్నారు. షాంఘైలోని హౌషన్ హాస్పిటల్లో పని చేస్తున్న ఆయన.. ప్రస్తుతం చైనా ‘కోవిడ్–19 క్లినికల్ ఎక్స్పర్ట్ టీం’కి లీడ్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా మన దగ్గర చిక్కుకుపోయిన చైనా స్టూడెంట్స్తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
లైఫ్ స్టైల్ వల్లే..
‘‘కరోనా వైరస్ తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఇండియన్స్కి లేకపోయినా.. వారికున్న మానసిక స్థైర్యం వారిని రక్షిస్తోంది. ముఖ్యంగా ఇండియన్స్ చాలా ప్రశాంతంగా ఉంటారు. తక్కువ ఆందోళన చెందుతారు. ఈ రెండే వారిని వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే.. ఇండియాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు తక్కువ. అయినప్పటికీ కేసుల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం ఇండియన్స్ లైఫ్ స్టైల్’ అని ఝూంగ్ తన రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు.
మనోళ్లు ఏం ఆలోచిస్తున్నారంటే..
వాషింగ్టన్ యూనివర్సిటీ కూడా దాదాపుగా ఝూంగ్ అభిప్రాయంతో ఏకీభవించింది. అమెరికాలో కరోనా పేషెంట్లు ఆందోళన, భయం, యాంగ్జైటీ కారణంగానే ఎక్కువగా చనిపోతున్నారని చెప్పింది. ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉండడానికి మానసిక బలమే కారణమని వాషింగ్టన్ యూనివర్సిటీ పేర్కొంది.
అయితే ఇండియన్స్లో చాలామంది కరోనా ముప్పు కంటే ఉపాధి, ఆదాయం తగ్గిపోతుండడం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని పేర్కొంది. కాలేజియేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కూడా భారతీయుల మనోబలాన్ని పొగుడుతూ ఓ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అతితక్కువ మరణాలతో ఇండియా కరోనా ముప్పు నుంచి బయటపడుతుందని ఆ రీసెర్చ్ వెల్లడించింది.