IND vs PAK: మోడీ స్టేడియంలో అమిత్ షా: ఇండియా- పాక్ మ్యాచ్ వీక్షించిన కేంద్ర హోంమంత్రి

IND vs PAK: మోడీ స్టేడియంలో అమిత్ షా: ఇండియా- పాక్ మ్యాచ్ వీక్షించిన కేంద్ర హోంమంత్రి

భారత గడ్డపై జరిగే వరల్డ్ కప్ పోరులో గెలిచేది తామే అంటూ ప్రగల్భాలు పలికిన పాక్ ఆటగాళ్లకు భంగపాటు ఎదురైంది. మరోసారి అలాంటి మాట్లాడే అవకాశం లేకుండా భారత ఆటగాళ్లు.. వారిని చిత్తుచిత్తుగా ఓడించారు. మొదట బ్యాటర్లు విఫలమవ్వగా.. తామేం తక్కువ కాదన్నట్టు బౌలర్లు వారి దారిని అనుసరించడం ఈ మ్యాచ్ ప్రత్యేకత. 

మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 191 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గజినీ మహమ్మద్‌లా దండయాత్ర చేశాడు. ఓడినా.. భారత బ్యాటర్లను వణికించాం.. అని చెప్పుకుంటారు అనుకున్నాడో.. ఏమో కానీ నిర్ధాక్షిణంగా వారిని ఊచకోత కోశాడు. భారత ఇన్నింగ్స్ పవర్ ప్లే ముగిసేసరికి పాక్ ఓటమిని ఖరారు చేశాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులను ఎంటర్టైన్ చేయడం కోసం.. పాక్ బౌలర్లను బలిపశువులను చేశాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. 

మోడీ స్టేడియంలో అమిత్ షా

ఇదిలావుంటే, భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. సాధారణ ప్రేక్షకుల నడుమ సాధారణ పౌరుడిలా నిల్చొని ఆయన మ్యాచ్ వీక్షించారు. పక్కన ఉన్న ఓ చిన్నారిని ఆయన ముద్దు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెమెరాలో ఆ దృశ్యాలు కనపడుతున్నపుడు.. ఆయన ప్రేక్షకులకు విజయ సంకేతం చూపించారు.