IND vs PAK: భారత బౌలర్ల మాయాజాలం..191 పరుగులకే పాక్ ఆలౌట్

IND vs PAK: భారత బౌలర్ల మాయాజాలం..191 పరుగులకే పాక్ ఆలౌట్

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 191 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌(50) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ హోరాహోరీ తప్పదనుకున్నప్పటికీ.. బాబర్ వెనుదిరిగాక అంతా తలకిందులైంది. మరో ఏడు ఓవర్లు మిగిలివుండగానే పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమదే గెలుపంటూ గంభీరాలు పలికిన పాకిస్తాన్ ఆటగాళ్లు సమయం వచ్చేసరికి తడబడ్డారు. భారత బౌలర్ల జోరుకు క్రీజులో నిలబడలేక పెవియన్‌కు క్యూ కట్టారు. 29.4 ఓవర్లలో 155/2 స్కోర్‌తో పటిష్టంగా ఉన్న పాక్.. 35.2 ఓవర్లు ముగిసేసరికి.. కేవలం 34 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడ్డ పాకిస్తాన్ బ్యాటర్లు.. 42.5 ఓవర్ల వద్ద తమ ఇన్నింగ్స్‌ను ముగించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.