
శ్రీలంకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి మాల్దీవులకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే అందుకు భారత్ సహకరించిందనే వార్తలపై భారత హైకమిషన్ స్పందించింది. అవన్నీ నిరాధార, ఊహాజనిత వార్తలని హైకమిషన్ తోసిపుచ్చింది. మునుపటిలాగే ఆ దేశ ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రకటించింది. కాగా రాజీనామా చేయకుండానే పారిపోయిన గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ప్రధాని విక్రమసింఘే శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించగా.. నిరసనకారులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మిలిటరీ దళాలు.. వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
High Commission categorically denies baseless and speculative media reports that India facilitated the recent reported travel of @gotabayar @Realbrajapaksa out of Sri Lanka. It is reiterated that India will continue to support the people of Sri Lanka (1/2)
— India in Sri Lanka (@IndiainSL) July 13, 2022