గెలిస్తేనే.. నిలిచేది.. ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్ 13) ఇండియా కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గెలిస్తేనే.. నిలిచేది.. ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్ 13) ఇండియా కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అంట్వెర్ప్:  నాలుగు వరుస పరాజయాల తర్వాత ఇండియా హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. యూరోప్ లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా తీవ్రంగా నిరాశపర్చింది. 

ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ 1–2, 2–3తో ఓడింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ వైఫల్యాలనే పునరావృతం చేసింది. ప్రస్తుతం ఈ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన 12 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 15 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇండియా.. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిస్తేనే టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-3లో కొనసాగే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ‘ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలవడం మాకు చాలా కీలకం. పాయింట్ల పరంగానే కాకుండా జట్టు విజయాలబాట పట్టడానికి కూడా ఇది చాలా అవసరం. 

గత నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చినా చివర్లో తడబడ్డాం. ఆ స్ట్రాటజీని మార్చి కొత్త ఆట ఆడాలి’ అని కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. పేలవమైన పెనాల్టీ కార్నర్లు, ఆలస్యంగా గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొరపాట్లను సరిదిద్దుకుంటే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాను విజయం వరించొచ్చు. పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్ దశలో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించిన ఇండియా అదే ఆటను రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని భావిస్తోంది. ఇక ఈ నెల 21, 22న బెల్జియంతో జరిగే రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఇండియా యూరోప్ లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించనుంది.