సుల్తాన్‌‌ జోహర్‌‌ కప్‌లో ఇండియా గెలుపు

 సుల్తాన్‌‌ జోహర్‌‌ కప్‌లో ఇండియా గెలుపు

జోహర్‌‌ బారు (మలేసియా): సుల్తాన్‌‌ జోహర్‌‌ కప్‌‌ హాకీ టోర్నీలో ఇండియా తొలి విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన గ్రూప్‌‌–బి రెండో మ్యాచ్‌‌లో ఇండియా 3–1తో మలేసియాకు చెక్‌‌ పెట్టింది. అర్జున్‌‌ (28వ ని.), అమన్‌‌దీప్‌‌ (37వ ని.), రోహిత్‌‌ (54వ ని.) ఇండియాకు గోల్స్‌‌ అందించారు.