
- నేడు కొరియాతో ఢీ
కౌలాలంపూర్ : ఇండియా హాకీ టీమ్ ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్లో మూడో టైటిల్పై గురి పెట్టింది. ఇదివరకు రెండుసార్లు చాంపియన్గా నిలిచిన ఇండియా మంగళవారం మొదలయ్యే తాజా టోర్నీలో సత్తా చాటాలని ఆశిస్తోంది. తొలి మ్యాచ్లో కొరియాపై ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. 2001, 2016లో ట్రోఫీ గెలిచిన ఇండియా, 1997లో రన్నరప్గా నిలిచింది.
రెండేండ్ల కిందట భువనేశ్వర్లో జరిగిన గత ఎడిషన్ లో నాలుగో ప్లేస్తో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పోడియంపైకి రావాలని కోరుకుంటోంది. కొరియాతో పాటు కెనడా, స్పెయిన్తో కూడిన సులువైన పూల్–సిలో బరిలోకి దిగుతోంది. గురువారం స్పెయిన్తో, శనివారం కెనడాతో తలపడనుంది.