ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఈ నెల 22 వరకు భారతదేశం అంతటా ‘ఇండియన్ జ్యూయలరీ షాపింగ్ ఫెస్టివల్’ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం కౌన్సిల్ సోమవారం నిర్వహించిన రోడ్షోలో నటి శృతి హాసన్ పాల్గొన్నారు.
ఫెస్టివల్ సందర్భంగా ప్రతి రూ. 25 వేల- విలువైన నగల కొనుగోలుపై కూపన్ ఇస్తారు. వెండి నాణేన్ని ఫ్రీగా ఇస్తారు. లక్కీ ద్వారా ఎంపికైన కస్టమర్లకు 50 కిలోల వరకు బంగారం, బంపర్డ్రా విజేతకు 500 కిలోల వెండి, రూ. 5 కోట్ల విలువైన బహుమతులు ఇస్తారు.