ఫైనల్లో అశ్విని–క్రాస్టో జోడీ

ఫైనల్లో అశ్విని–క్రాస్టో జోడీ

లక్నో :  ఇండియా స్టార్‌‌ బ్యాడ్మింటన్‌‌ జోడీ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్‌‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన విమెన్స్‌‌ డబుల్స్‌‌ సెమీస్‌‌లో ఏడోసీడ్‌‌ అశ్విని జంటకు వాకోవర్‌‌ విజయం లభించింది. తొలి గేమ్‌‌లో స్కోరు 11–10 ఉన్న దశలో ప్రత్యర్థి, టాప్‌‌సీడ్‌‌ యుకీ ఫుక్‌‌షిమా–సయాకా హిరోటా (జపాన్‌‌) గాయం కారణంగా ఆట నుంచి వైదొలిగింది.  

మరోవైపు మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో ప్రియాన్షు రజావత్‌‌ 21–18, 14–21, 17–21తో చి యు జెన్‌‌ (చైనీస్‌‌ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. గంటా 14 నిమిషాల మ్యాచ్‌‌లో ప్రియాన్షు తొలి గేమ్‌‌లో ఆకట్టుకున్నా.. చివరి రెండు గేమ్‌‌ల్లో వెనుకబడిపోయాడు.