పంకజ్‌‌‌‌‌‌‌‌కు 27వ వరల్డ్ టైటిల్

పంకజ్‌‌‌‌‌‌‌‌కు 27వ వరల్డ్ టైటిల్

దోహా: ఐబీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్​వరల్డ్ బిలియర్డ్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వాణీ  ఐదోసారి గ్రాండ్​ డబుల్ సాధించాడు. శుక్రవారం జరిగిన పాయింట్ ఫార్మాట్ ఫైనల్లో 5–0తో ఇండియాకే చెందిన సౌరవ్‌‌‌‌‌‌‌‌ కోఠారిని ఓడించాడు. దాంతో, తన వరల్డ్ టైటిళ్ల సంఖ్యను పంకజ్ 27కి పెంచుకున్నాడు. 

నాలుగు రోజుల కిందట ఇదే టోర్నీ లాంగ్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సౌరవ్‌‌‌‌‌‌‌‌నే ఓడించి పంకజ్‌‌‌‌‌‌‌‌ విజేతగా నిలిచాడు. ఇలా వరల్డ్ బిలియర్డ్స్ లాంగ్, పాయింట్ ఫార్మాట్లు రెండింటిలో పంకజ్ విజేతగా నిలవడం ఇది ఐదోసారి. ఇది వరకు 2005, 2008, 2014, 2018లో ఈ ఘనత సాధించాడు. 2015 స్నూకర్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లోనూ డబుల్ ధమాకా మోగించాడు.