దోహా: ఇండియా స్టార్ షూటర్ అనీష్ భన్వాలా.. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో అనీష్ 27 పాయింట్లు నెగ్గి మూడో ప్లేస్లో నిలిచాడు.
పీటర్ ఫ్లోరియన్ (జర్మనీ), లీ యూహోంగ్ (చైనా) వరుసగా 37, 33 పాయింట్లతో గోల్డ్, సిల్వర్ నెగ్గారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్లో 581 పాయింట్లు నెగ్గిన అనీష్ ఆరుగురుతో కూడిన ఫైనల్స్కు క్వాలిఫై అయ్యాడు.