న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షూటర్ సరబ్జ్యోత్ సింగ్.. ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్తో పాటు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సరబ్జ్యోత్ 221.1 పాయింట్లతో మూడో ప్లేస్లో నిలిచాడు. దీంతో ఇండియా తరఫున పారిస్ బెర్త్ సాధించిన ఎనిమిదో షూటర్గా నిలిచాడు.
వరుణ్ తొమర్ (578), కునాల్ రాణా (577), శివ నర్వాల్ (576), సౌరభ్ చౌదరి (569) ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. విమెన్స్ 10 మీటర్లలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ (576), రిథమ్ సంగ్వాన్ (577), సురభి రావు (575), రుచిత వినెర్కార్ (571), పాలక్ (570) నిరాశపర్చారు. జూనియర్ విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సైన్యాం 240.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ను గెలిచింది.