ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌ 750 టోర్నీ డబుల్ల్స్ విజేత సాత్విక్‌‌ –చిరాగ్‌‌ షెట్టి జోడి

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌ 750 టోర్నీ డబుల్ల్స్  విజేత సాత్విక్‌‌ –చిరాగ్‌‌ షెట్టి జోడి

పారిస్‌‌: ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌–750 టోర్నీలో ఇండియా స్టార్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిశారు. ఆదివారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–13, 21–19తో లు చింగ్‌‌ యో–యంగ్‌‌ పో హన్‌‌ (చైనీస్‌‌ తైపీ)పై గెలిచారు. 5–0తో తొలి గేమ్‌‌ను మొదలుపెట్టిన ఇండియన్‌‌ జోడీ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు.

బలమైన స్మాష్‌‌లు, సర్వీస్‌‌ రిటర్న్స్‌‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. దీంతో రెండు, మూడు పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లిన సాత్విక్‌‌–చిరాగ్‌‌ ఈజీగా తొలి గేమ్​ను సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‌‌లో ఇరువురు ప్రతి పాయింట్‌‌ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే 3–3తో స్కోరు సమమైన తర్వాత ఇండియన్‌‌ ద్వయం వరుసగా మూడుసార్లు మూడు పాయింట్లతో 12–5తో లీడ్‌‌లోకి వెళ్లింది. ఈ దశలో పుంజుకున్న చైనీ జోడీ.. వరుస పాయింట్లతో 15–15, 17–17తో స్కోరును సమం చేయడంతో పాటు 19–17తో లీడ్‌‌లోకి వెళ్లింది. ఇక్కడి నుంచి బలమైన స్మాష్‌‌లు సంధించిన సాత్విక్‌‌–చిరాగ్‌‌ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు.