ఏఎఫ్‌‌‌‌‌‌‌‌సీ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా ఓటమి

ఏఎఫ్‌‌‌‌‌‌‌‌సీ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా ఓటమి

తాష్కెంట్‌‌‌‌‌‌‌‌: ఏఎఫ్‌‌‌‌‌‌‌‌సీ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు చుక్కెదురైంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–సిలో వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ ఓడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 1–3తో వియత్నాం చేతిలో పరాజయంపాలైంది. దీంతో పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించలేకపోయింది.

ఇండియా తరఫున సాంధియా రంగనాథ్‌‌‌‌‌‌‌‌ (80వ ని.) ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ చేయగా, హున్‌‌‌‌‌‌‌‌ నుహ్‌‌‌‌‌‌‌‌ (4వ ని.), ట్రాన్‌‌‌‌‌‌‌‌ తాయ్‌‌‌‌‌‌‌‌ హాయ్‌‌‌‌‌‌‌‌ లిన్హ్‌‌‌‌‌‌‌‌ (22వ ని.), పామ్‌‌‌‌‌‌‌‌ హాయ్‌‌‌‌‌‌‌‌ యెన్‌‌‌‌‌‌‌‌ (73వ ని.) వియత్నాంకు గోల్స్ అందించారు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 0–7తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్​ జపాన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా. , ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.