ఆసియా కప్ ఛాంపియన్గా టీమిండియా ఉమెన్స్ టీం

ఆసియా కప్ ఛాంపియన్గా టీమిండియా ఉమెన్స్ టీం

ఆసియా కప్ను భారత మహిళల జట్టు మరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో అదరగొట్టిన ఉమెన్స్ టీం.. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. 66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే హర్మన్ సేన ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందాన 51 రన్స్ చేసి నాటౌట్గా నిలిచింది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీరా, కవిశఆ దిల్హరి చెరో వికెట్ తీశారు.

అంతకుముందు శ్రీలంకను ఇండియా తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. రేణుకాసింగ్ ఠాకూర్ తన బౌలింగ్తో శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టింది. మూడు ఓవర్లలో కేవలం 5రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసింది. రాజేశ్వరి గయక్వాడ్, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక టీంలో రణవీర18 పరుగులు చేసిన టాప్ స్కోరర్‌గా నిలిచింది.  మొత్తం ఎనిమిదిసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ఉమెన్స్ టీం..7 సార్లు కప్ ను కైవసం చేసుకుంది. 2004, 2005,2006 ,-2008, 2012, 2016,2022లో టీమిండియా కప్ కొట్టింది.