
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. వర్షం వల్ల 16 ఓవర్లకు గానూ 151 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 145 స్కోరుకు మాత్రమే పరిమితమైంది. ఈ విక్టరీతో టీమిండియా సెమీస్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది.
మ్యాచ్ ను మలుపుతిప్పిన వర్షం
మొత్తం మ్యాచ్ ని వర్షం మలుపుతిప్పింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు లిటన్ దాస్ (60), షాంటో (21) అదిరిపోయే అరంభాన్ని ఇచ్చారు. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీకి తరలించారు. ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఆ జట్టు 66 పరుగులు చేసింది. ఓ క్రమంలో ఈజీగానే బంగ్లా టార్గెట్ ను ఫినిష్ చేస్తుందని అనిపించింది. అయితే వర్షం తరువాత మ్యాచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
వర్షం తరువాత బంగ్లా టార్గెట్ 9 ఓవర్లలో 85 పరుగులు కావడంతో ఆ జట్టు తొందరగానే ఓపెనర్లిద్దిరిని కోల్పోయింది. లిటన్ దాస్ (60) రనౌట్ కాగా షాంటో (21) షమీ బౌలింగ్లో వెనుదిరిగాడు. కాసేపటికే అసిఫ్ (3), షకిబ్ (13), యాసిర్ (1) , మొసాడెక్ (6) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో మ్యాచ్ టీమిండియా చేతిలోకి వచ్చేసింది. భారత్ తరుపున అర్ష్ దీప్, పాండ్యా చేరో రెండు వికెట్లు తీశారు.